న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. అయితే కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా నిలయాలుగా మారుతున్న మార్కెట్లపై ప్రభుత్వం కొరఢా ఝులిపిస్తున్నది. మొన్న కరోనా రూల్స్ పాటించని జనపథ్ మార్కెట్పై నిషేధం విధించిన కేజ్రివాల్ సర్కార్.. తాజా సుల్తాన్పురి మార్కెట్పై ఆంక్షలు విధించింది. కరోనా కట్టడి నియమాలు పాటించకపోవడంతో సుల్తాన్పూర్ సబ్జీ మండీని మూసివేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) అధికారులు ఆదేశాలు జారీచేశారు. మార్కెట్లో భౌతిక దూరం పాటించనందున సబ్జీ మండీని ఈ నెల 16 వరకు మూలివేయాలని అందులో పేర్కొన్నారు. ఇదేవిధంగా కొవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాణీ బాగ్ బజార్ను కూడా మూసివేశారు.