అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికీ రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదవుతున్నది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కూడా మొత్తం 91,253 శాంపిళ్లను పరీక్షించగా 21,320 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,75,372కు చేరింది.
ఇక అక్కడ కొత్తగా 99 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,580కి చేరింది. కొత్తగా నమోదైన కరోనా మరణాల్లో చిత్తూరు, కృష్ణ, విజయనగరం జిల్లాలకు చెందిన వారు 10 మంది చొప్పున.. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు తొమ్మిది మంది చొప్పున ఉన్నారు. ఇక అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన వారు ఎనిమిదేసి మంది మృతిచెందారు.
వారితోపాటు కర్నూలు జిల్లాలో ఆరు, శ్రీకాకుళం జిల్లాలో ఆరు, నెల్లూరు జిల్లాలో ఐదు, వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 21,274 మంది కరోనా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 1,81,40,307కు చేరింది.