దామరచర్ల, ఏప్రిల్ 20: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి. నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వీర్లపాలెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మండలంలో ఇప్పటికే 20 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ డి.నందిని, పీఏసీఎస్ సీఈఓ వెంకట్రెడ్డి, హతీ రాం, హన్మిరెడ్డి, కోట్యానాయక్, వినోద్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పీఏపల్లిలో ప్రారంభం
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, వైస్ చైర్మన్ శిరసువాడ శ్రీనయ్య, సర్పంచ్ గొర్ల సైదమ్మ శ్రీనువాస్, సీఈఓ వెంకటేశ్వర్రెడ్డి, ఏఓ పాండునాయక్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
త్రిపురారం : మండలంలోని వస్త్రాంతండాలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్, సర్పంచ్ గౌతమి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని 17 శాతం తేమతో, తాలు లేకుండా చూసుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం దిలీప్కుమార్, సీసీ పిచ్చమ్మ, వీబీకే సుజాత, మంగ్తానాయక్, బిక్నా పాల్గొన్నారు.