అహ్మదాబాద్ : అమూల్ కంపెనీ ఎండీ ఆర్ఎస్ శోధి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం రాత్రి గుజరాత్లోని ఆనంద్ టౌన్లో శోధి కారు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం శోధి, డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శోధి అమూల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా 2010 నుంచి కొనసాగుతున్నారు.