శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సిటీలో శనివారం తెల్లవారుజామున పోలీస్ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతిచెందాడు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్లో లభ్యమైన కారు నంబర్ ఆధారంగా ఉగ్రవాదుల కోసం గాలింపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
శనివారం పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా శ్రీనగర్ సిటీలోని బార్బర్ షా చౌక్ ఏరియాలో భద్రతా విధుల్లో ఉండగా.. ఓ కారులో వచ్చిన ఉగ్రవాదులు ఆ క్యాంప్ వైపు గ్రెనేడ్ విసిరి పోయారు. అయితే, ఆ గ్రెనేడ్ రోడ్డుపైనే పడి పేలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి.