న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ నేత ప్రపుల్ పటేల్తో అహ్మదాబాద్లో జరిగిన భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు మాజీ ముంబై పోలీస్ అధికారి, సస్పెన్షన్ వేటు పడిన సచిన్ వజేతో సంబంధాలపై సేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ సర్కార్ చిక్కుల్లో పడిన క్రమంలో తాజా భేటీపై పలు ఊహాగానాలు చెలరేగాయి.
ఈ సమావేశంపై అమిత్ షా స్పందిస్తూ ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పవార్, అమిత్ షాల మధ్య సమావేశం నేపథ్యంలో మహారాష్ట్రలో సమీకరణాలు మారతాయని భావిస్తున్నారు.