మక్తల్రూరల్, మే 19 : మండలం గుడిగండ్లలో శివారులోని గుట్టపై ని ర్మించిన మిషన్ భగీరథ పథకం వాటర్ ట్యాంక్లో ఎవరూ పడిచనిపోలేదని, పరిసర గ్రామస్తులు వదంతులు నమ్మరాదని మిసన్ భగీరథ లైన్మెన్ మల్లేశ్, వాటర్మెన్ ఎల్లప్ప బుధవారం తెలిపారు. రెండు రోజుల కిందట మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో ఎవరో పడి చనిపోయారని వదంతులు వచ్చాయి. దీంతో జక్లేర్, గుడిగండ్ల పరిసర గ్రామాల ప్రజలు మిసన్ భగీరథ పథకం ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని పారబోశారు. మరికొందరు కలుషిత నీటివల్ల తమకు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు మిషన్ భగీరథ సిబ్బందికి సమాచారం అందించారు. ఈమేరకు బుధవారం ఉదయం గుడిగండ్ల గ్రామ శివారులో గుట్టపై ఉన్న మిషన్ భగీరథ పథకం వాటర్ ట్యాంక్ను పరిశీలించారు. వాటర్ ట్యాంక్పై భాగంలో ఉన్న మ్యాన్హోల్ తెరిచి తనఖీ చేశారు. అందులో ఎవరూ పడిఉన్న దాఖలాలు కనిపించలేదని వాటర్మెన్ ఎల్లప్ప తెలిపారు. ట్యాంక్లోనుంచి నీటిని బయటకు తోడివేసిక్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ట్యాంక్ను శుభ్రం చేశామన్నారు. వదంతులను గ్రామస్తులు ఎవరూ నమ్మరాదని, ఎవరో కావాలని పుకార్లు పుట్టించారన్నారు. యథావిధిగా మంచినీటి సరఫరా జరుగుతుందని మిషన్భగీరథ లైన్మెన్ మల్లేశ్, వాటర్మెన్ ఎల్లప్ప స్పష్టం చేశారు.