భద్రాద్రి కొత్తగూడెం : పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందిన ఘటన జిల్లాలోని దుమ్ముగూడెం మండలం ఆంధ్రకేసరినగర్లో బుధవారం జరిగింది. స్థానికుల తెలిసిన వివరాల ప్రకారం.. ఆంధ్రకేసరి నగర్కు చెందిన చాట్ల వీర్రాజు(53), జుంజూరి భాస్కర్రావు(55) బర్రెలను మేపేందుకు గ్రామ శివారులోకి వెళ్లారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వీరి సమీపంలోనే పిడుగులు పడి ఇద్దరూ ఉన్నచోటే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని దుమ్ముగూడెం పీహెచ్సీకి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు తెలిపారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
హరితోత్సవానికి అంతా సిద్ధం : మంత్రి ఐకే రెడ్డి
బైక్ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి