న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఉన్నత విద్యాశాఖ మాజీ కార్యదర్శి అమిత్ ఖరే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహాదారుగా నియమితులయ్యారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన రెండేండ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. 1985 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన ఖరే.. గత నెలలోనే పదవీ విరమణ చెందారు. 1990లలో బీహార్లో దాణా కుంభకోణాన్ని వెలుగులోకి తేవడంలో ఖరేదే ముఖ్యపాత్ర. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం-2020 రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.