రాంచీ: జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ, ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులకు కొత్త భాష్యం చెప్పారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్లో దారుణానికి పాల్పడ్డాయని ఆరోపించారు. తల్లులు, సోదరీమణులు, పిల్లలను వారు వేధించారని విమర్శించారు. అమెరికా దళాల దారుణాలకు వ్యతిరేకంగా అక్కడ పోరాటం జరుగుతున్నదని చెప్పారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు, ఆఫ్ఘన్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. శుక్రవారం రాంచీలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ ఈ మేరకు వ్యాఖ్యానించి ఆవేదన వ్యక్తం చేశారు.