న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్ 2011 వరల్డ్కప్ గెలిచి నేటికి సరిగ్గా పదేళ్లు. ఆ వరల్డ్కప్ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా.. ఫైనల్లో గెలుపు కోసం ధోనీ కొట్టిన ఆ సిక్సే గుర్తుకు వస్తుంది. అయితే ఆ ఒక్క సిక్స్తోనే వరల్డ్కప్ గెలవలేదని అంటున్నాడు ఆ మ్యాచ్లో టాప్ స్కోరర్ గౌతమ్ గంభీర్. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ యువరాజ్ సింగ్తోపాటు ఈ విజయం వెనుక ఎంతో మంది హీరోలు ఉన్నారని అతడు అంటున్నాడు. ఫైనల్లో 97 పరుగులు చేసిన గౌతీ.. విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2011, ఏప్రిల్ 2న జరిగిన ఆ అద్భుతం గురించి నెమరు వేసుకున్నాడు.
వెనక్కి చూసింది చాలు.. ముందు చూడండి
టీమిండియా వరల్డ్కప్ గెలిచి పదేళ్లు అయిన సందర్భాన్ని అందరూ చాలా ఉత్సాహంగా గుర్తు చేసుకుంటుంటే.. గంభీర్ మాత్రం ఇక వెనక్కి చూసింది చాలు అని అనడం విశేషం. ఇది నిన్నే జరిగినట్లు లేదు. కనీసం నాకైతే అలా అనిపించడం లేదు. ఇప్పటికే పదేళ్లయింది. నేను వెనక్కి చూస్తూ మురిసిపోయే వ్యక్తిని కాను. అదొక గర్వకారణమైన విషయమే కానీ ఇక ఇండియన్ క్రికెట్ ముందడుగు వేయాలి. ఆ తర్వాత ఒక్క వరల్డ్కప్ కూడా గెలవలేదు. ఎప్పుడో వరల్డ్కప్ గెలిచామని మీరు ఎక్కువ సంబరపడిపోవద్దు. ఆ టోర్నీలో ఆడిన ప్లేయర్స్ వాళ్లు ఏం చేయాలో అది చేశారు. మేము కేవలం ఏదో ఆడాలని ఆడలేదు. కప్పు గెలవాలనే ఆడాం అని గంభీర్ అనడం విశేషం. అంతకుముందు టీమిండియా గెలిచిన టీ20 వరల్డ్కప్ ఫైనల్లో గంభీరే టాప్ స్కోరర్ కావడం ఇక్కడ మరో విశేషం.
ఇక ఆ వరల్డ్కప్ గురించి మాట్లాడటం ఆపేసి తర్వాతి వరల్డ్కప్పై దృష్టి సారించాలని గంభీర్ సూచించాడు. 2015 లేదా 2019 వరల్డ్కప్ గెలిచి ఉంటే క్రికెట్లో ఇండియా ఓ సూపర్ పవర్గా నిలిచేదని గౌతీ అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరూ పదే పదే 1983 లేదా 2011 వరల్డ్కప్ గురించే ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. అది గొప్ప విషయమే కావచ్చు కానీ వెనక్కి చూడటం కంటే ముందుకు చూడటం అనేది మంచి విషయం. మనం వెనక్కి చూసినంత కాలం ముందడుగు వేయలేం అని గంభీర్ స్పష్టం చేశాడు.
టీ20 వరల్డ్కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?