కోవిడ్ సెకండ్ వీవ్ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్. కోవిడ్ రోగులతో పాటు ఇతర రోగులతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లకు బెడ్లు సరిపోకపోవడంతో అంబులెన్స్ లోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
గత 10 రోజులుగా గుజరాత్ లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయాయి. అహ్మదాబాద్ లో రోజుకి దాదాపు 5వేల కోవిడ్ కేసులు నమోదు కావడంతో హాస్పిటల్స్ లో చేరే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పుడున్న అంబులెన్స్ లతో పాటు 108 సర్వీసుల సంఖ్యని కూడా ప్రభుత్వం పెంచడం ఆందోళన కలిగిస్తోంది.