భోపాల్ : కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పదేపదే ఆదేశిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన అంబులెన్స్ డ్రైవర్ కూడా ఈ నిబంధన పట్ల నిర్లక్ష్యం వహించాడు. ఓ రోగితో వెళ్తున్న అంబులెన్స్ను ఓ చెరుకు రసం బండి వద్ద ఆపి ముఖానికి మాస్కు లేకుండా నిల్చున్నాడు. అయితే ఆ అంబులెన్స్లో బెడ్పై పడుకుని ఉన్న రోగికి కరోనా ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ శాదూల్ జిల్లాలో వెలుగు చూసింది.
ఓ అంబులెన్స్లో డ్రైవర్తో పాటు మరో ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్ ధరించి ఉన్నారు. ఇంకో వ్యక్తి అంబులెన్స్ వెనుక భాగంలో బెడ్పై పడుకొని ఉన్నాడు. అయితే అంబులెన్స్ను చెరుకు రసం బండి వద్ద డ్రైవర్ ఆపాడు. అతను చెరుకు రసం బండి ఎదుట నిల్చుని మాస్కు సరిగా ధరించకుండా నిల్చుని ఫోన్లో మునిగిపోయాడు. మరో వ్యక్తి అంబులెన్స్లో కూర్చొని ఉన్నాడు. వెనుకాలే ఓ రోగి బెడ్పై పడుకుని ఉన్నాడు.
అయితే అక్కడే ఉన్న ఓ బాధ్యత కలిగిన పౌరుడు ఆ డ్రైవర్ను ముఖానికి మాస్కు సరిగా ధరించండి అని సూచించాడు. కరోనా రోగితో వెళ్తున్న అంబులెన్స్ను ఇక్కడ ఆపి.. ఇతరులకు వ్యాపింప చేయడం సరికాదు అని చెప్పాడు.
ఇందుకు ఆ డ్రైవర్ స్పందిస్తూ.. తనకు కరోనా లేదని, రోగిని మాత్రమే తరలిస్తున్నామని చెప్పాడు. తనను చెరుకు రసం తాగనివ్వండి అని అన్నాడు. కెమెరాలో రికార్డు చేస్తున్న దృశ్యాలను గమనించిన ఆ డ్రైవర్ వెంటనే మాస్కును సరి చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు 3,41,887 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 54 వేల మంది చనిపోయారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,31,968 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇవికూడా చదవండి..
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?