జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, ఏప్రిల్ 26: జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగురేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే 11,12,27,14వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. 11వ వార్డులోని సరస్వతీనగర్, శ్రీనివాసనగర్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి బీ జ్యోతి తరఫున, 12వ వార్డులోని శ్రీనివాసనగర్, సరస్వతీనగర్ కాలనీల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రఘురాంగౌడ్తో కలిసి ప్రచారం చేశారు. 27వ వార్డులోని ఇందిరానగర్కాలనీ, గాంధీనగర్ కాలనీల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్మడి యాదయ్య తరఫున, 14వ వార్డులోని సంజీవయ్యకాలనీ, హనుమాన్వీధి, నల్లకుంట, త్రిశూల్నగర్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి కోనేటి పుష్పలత తరఫున ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు సంతోషంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ లక్ష్యం నెరవేరినట్లని, అందుకు తగ్గట్లుగా పథకాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. జడ్చర్ల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. అందుకు ప్రజలంతా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు పలికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. టీఆర్ఎస్ 27స్థానాలను గెలుచుకొని తీరుతుందన్నారు.
గులాబీ పార్టీలో చేరిన వంద మంది
జడ్చర్లలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో సంజీవయ్యకాలని, నల్లకుంటకు చెందిన దాదాపు 100మందికిపైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జేకే నర్సింహులు ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ వార్డులోని సంజీవయ్య కాలనీ, నల్లకుంట, హనుమాన్ వీధిలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యిందన్నారు. 14వ వార్డులో కోనేటి పుష్పలత గెలుపు ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో ప్రవీణ్, కేశవులు, మన్యం, యాదయ్య, రాములు, శంకర్, హరీశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్షయ్య, మాజీ చైర్మన్ మురళి, 11వ వార్డు అభ్యర్థి జ్యోతి, 12వ వార్డు అభ్యర్థి రఘురాంగౌడ్, 27వ వార్డు అభ్యర్థి యాదయ్య, 14వ వార్డు అభ్యర్థి పుష్పలత, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, మెకానిక్ శివయ్య, జగదీశ్వరాచారి, నర్సింహులు, శ్రీనివాస్రెడ్డి, ఊళ్లబాయి యాదిరెడ్డి, బీకేఆర్, శేఖర్రెడ్డి, మాజీ వార్డు సభ్యులు వెంకటస్వామిగౌడ్, శివయ్య, పర్మటయ్య, నాగులు, మెకానిక్ సత్యం, రమేశ్, ప్రదీప్, మచ్చల శ్రీను, కృష్ణారెడ్డి, పాప నర్సింహులు, ముచ్చర్ల శ్రీకాంత్, నర్సింహులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
థియేటర్ లో ఫ్లాప్..కానీ ఓటీటీలో హిట్టు..!
4.5 లక్షల రంజాన్ గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ