IPL2021 | ఓ వైపు పెరుగుతున్న ఎండలు.. మరోవైపు కరోనా కేసులు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీడాభిమానులకు వినోదం పంచేందుకు క్రికెట్ పండుగ ఐపీఎల్ సిద్ధమైంది. కరోనా మహమ్మారి కారణంగా అట్టహాసమైన ప్రారంభోత్సవాలకు దూరంగా.. ప్రేక్షకులను అనుమతించకుండా.. ఖాళీ మైదానాల్లో ముంబై, బెంగళూరు పోరుతో ఈ ఏడాది సీజన్ ఆరంభమైంది.