కేంద్ర పట్టు మండలి మెంబర్ సెక్రటరీ రజిత్ రంజన్ ఒఖండియార్
పోచంపల్లిలో పట్టు రీలింగ్ యూనిట్ ప్రారంభం
భూదాన్పోచంపల్లి, మార్చి 28 : మల్బరీసాగుపై రైతులు దృష్టి సారించాలని కేంద్ర పట్టు మండలి మెంబర్ సెక్రటరీ రజిత్రంజన్ ఒఖండియార్ అన్నారు. ఆదివారం పోచంపల్లి పట్టణంలో రూ. 1.15 కోట్లతో ఏర్పాటు చేసిన శ్రీరంజన్ పట్టు రీలింగ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువ పట్టు వాడకం ఉందన్నారు. మల్బరీసాగుకు తెలంగాణ వాతావరణం అనుకూలమన్నారు. రీలింగ్ యూనిట్ ఏర్పాటుకు బీసీలకు 50 శాతం ఎస్సీ, ఎస్టీలకు 80 శాతం సబ్సిడీపై రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రైతులు పట్టు పరిశ్రమ అనుబంధ సాగు అయిన మల్బరీ సాగుపై ఎక్కువ దృష్టి సారించాలని కేంద్ర పట్టు మండలి మెంబర్ సెక్రటరీ రజిత్ రంజన్ ఒఖండియార్ అన్నారు. ఆదివారం పోచంపల్లి పట్టణంలో రూ.1.15 లక్షలతో ఏర్పాటు చేసిన శ్రీరంజన్ పట్టు రీలింగ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్తో దేశంలో చైనా పట్టు ఉత్పత్తి దిగుమతులు గణనీయంగా తగ్గాయన్నారు. అందుకే దేశంలోనే ఎక్కువగా సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 7900 మెట్రిక్ టన్నుల సిల్క్ ఉత్పత్తిలో తెలంగాణలో కేవలం 200 మెట్రిక్ టన్నుల సిల్క్ ఉత్పత్తి అయిందన్నారు. అందుకే ఇక్కడ పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువ పట్టు వాడకం జరుగుతుందని, అందుకే తెలంగాణలో పట్టు ఉత్పత్తికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మల్బరీ ఆకు సాగుకు తెలంగాణ వాతావరణం ఎంతో అనుకూలంగా ఉందన్నారు.
చైనా ఉత్పత్తులు పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంతో పట్టును దిగుమతి చేసుకునేస్థాయి నుంచి ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. అందుకే నూతన వంగడాలను సృష్టించామన్నారు. జీ4, జీ5 అనే వంగడాలను సృష్టించినందున రైతులకు ఎక్కువ లాభసాటిగా ఉంటుందని, రైతులు నూతన వ్యవసాయ సాగుపై ఆసక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. రీలింగ్ యూనిట్ ఏర్పాటుకు బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 80శాతం సబ్సిడీపై రుణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఇక్కడ పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందితే చేనేత కార్మికులకు తక్కువ ధరలో పట్టు లభించడంతోపాటు రైతులకు ఎక్కువ లాభం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హార్టికల్చర్, సెరీకల్చర్ డైరెక్టర్ ఎల్. వెంకటరామిరెడ్డి, కేంద్ర పట్టు టెక్నాలజీ పరిశోధన సంస్థ డైరెక్టర్ సుభాశ్నాయక్, కేంద్ర పట్టు పరిశోధన శిక్షణా సంస్థ డైరెక్టర్ బాబులాల్, ములుగు పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్కుమార్, తెలంగాణ ఉద్యాన, పట్టు పరిశ్రమ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్.సుధాకర్, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి.అన్నపూర్ణ, సెంట్రల్ సిల్క్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ వై.శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, శ్రీరంజర్ రీలింగ్ యూనిట్ యజమాని ఎన్నం మాధవీశివకుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సబ్సిడీపై మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ
పక్షుల దాహార్తి తీర్చేందుకు యువత యత్నం