శ్రీనగర్, జూలై 6: కరోనా కారణంగా అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకోలేకపోతున్న వారి కోసం దేవస్థానం బోర్డు ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. మంచు శివలింగానికి మీ పేరిట ప్రత్యేక పూజలు చేయించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే చాలు.. మీ పేరు, గోత్రం పేరిట మంచు శివలింగానికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. దేవుడి ప్రసాదాన్ని కూడా మీ ఇంటికే పంపుతారు. www.shriamarnathjishrine.com వెబ్సైట్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు.