దక్షిణాదిన తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతోంది కన్నడ సొగసరి రష్మిక మందన్న. బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ చిత్రాల్లో అవకాశాల్ని సొంతం చేసుకొని పాన్ఇండియా నాయికగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఈ అమ్మడు తెలుగులో మరో భారీ చిత్రంలో నటించబోతున్నదని సమాచారం. వివరాల్లోకి వెళితే..రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్రాజు పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. జూలై నెలలో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది. తనదైన శైలి వాణిజ్య విలువలు, సామాజికాంశాల కలబోతగా దర్శకుడు శంకర్ ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్చరణ్ సరసన నటించే కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. రష్మిక మందన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమెను కథానాయికగా ఖరారు చేశారని అంటున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని తెలిసింది. కథలోని బలమైన సామాజిక సందేశం, తన పాత్ర చిత్రణ నచ్చడంతో ఈ సినిమాను రష్మిక మందన్న వెంటనే అంగీకరించిందని చెబుతున్నారు. ఐఏఎస్ అధికారి పాత్రలో రామ్చరణ్ కనిపిస్తారని సమాచారం.