బీజింగ్ : గత వారం అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో కొంత మేర విజయం సాధించిన చైనా.. ఇప్పుడు తన దృష్టిని సముద్రం వైపు కదిలించింది. సముద్రాలను పర్యవేక్షించేందుకు కొత్త ఉపగ్రహాన్ని చైనా బుధవారం ప్రయోగించింది. భవిష్యత్లో సముద్ర విపత్తులను ముందుగా గుర్తించి హెచ్చరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనున్నది. వాయవ్య చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి హైయాంగ్ -2 డీ (హెచ్వై -2 డీ) ఉపగ్రహాన్ని లాంగ్ మార్చి -4 బీ రాకెట్ ద్వారా ప్రయోగించినట్లు చైనా మీడియా తెలిపింది.
నాసా రోవర్ తర్వాత మరో రోవర్ను అంగారక గ్రహానికి చేర్చిన ప్రపంచంలో రెండవ దేశంగా చైనా అవతరించింది. గతంలో ప్రపంచంలో మొట్టమొదటి క్వాంటం ఉపగ్రహాన్ని ప్రయోగించింది చైనాయే. అలాగే చంద్రుడిని చేరుకోవడంలో విజయవంతమయ్యారు. ప్రస్తుతం తనకంటూ సొంత అంతరిక్ష కేంద్రాన్ని తయారు చేసుకునే పనిలో చైనా నిమగ్నమైంది.
వాతావరణం , సముద్ర పర్యావరణం కోసం పర్యవేక్షణ వ్యవస్థలను తయారు చేయడంలో చైనా పరిశోధనలు జరుపుతున్నది. ఈ హెచ్వై-2డీ ని చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దానిని తీసుకెళ్లిన రాకెట్ను షాంఘై అకాడమీ ఆఫ్ స్పేస్ లైట్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. బుధవారం ప్రారంభించిన ఈ సిరీస్ 370 వ ప్రయోగం.
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
జూన్ 1 నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం
పాలస్తీనాకు అన్ని రకాల సాయం: పాక్ నిర్ణయం
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్లాక్ : కలకలలాడుతున్న ఎయిర్పోర్ట్స్, రెస్టారెంట్స్
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేయాలన్న పిటిషన్ తోసివేత
నటి మెర్కెల్ను వివాహమాడిన ప్రిన్స్ హ్యారీ.. చరిత్రలో ఈరోజు
కన్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ కనిపెట్టిండు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..