సత్తుపల్లికి రానున్న పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్రావు
పర్యటనను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే వెంకటవీరయ్య
సత్తుపల్లి/ సత్తుపల్లి రూరల్, జూలై 8: పల్లెప్రగతిలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఈనెల 11న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. 11న కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు వారు ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రేజర్లలో రూ.8 కోట్లతో నిర్మించబోయే బీటీ రోడ్డు పైలాన్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. సర్పంచ్ జక్కుల ప్రభాకర్రావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీటీసీ విస్సంపల్లి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో సుభాషిణి, ఏపీవో బాబూరావు, పీఆర్ ఏఈ వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి, గొర్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధే ‘ప్రగతి’కి సోపానం
పల్లెలు, పట్టణాలు సుందరంగా ఉండాలనే లక్ష్యంతోనే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపట్టినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం మున్సిపాలిటీలోని 7వ వార్డులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్ సలీమా ఖాతూన్ గఫార్ పాల్గొన్నారు.