యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ మూవీకి సంబంధించిన సర్ప్రైజ్ శ్రీరామనవమి సందర్భంగా రానుందని మేకర్స్ ప్రకటించారు. అందరు ఆ రోజు ఉదయాన్నే ప్రభాస్ ఫస్ట్ లుక్ వస్తుందేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. సాయంత్రం వరకు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ఆయన లుక్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కాని లుక్ బయటకు రాలేదు. దీనికి పలు కారణాలు చెబుతున్నారు. ప్రభాస్ లుక్ అంతగా ఆకట్టుకునేలా లేదని, దీనిని చూసిన కృష్ణం రాజు కుటుంబ సభ్యులు ఆ ఫొటోను విడుదల చేయోద్దని చెప్పినట్టు సమాచారం. మరోవైపు కరోనా విజృంభిస్తున్న సమయంలో రిలీజ్ చేయడం మంచిది కాదని భావించిన మేకర్స్ విడుదలని కొద్ది రోజుల పాటు వాయిదా వేసారనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్ ,లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక లంకేశ్వర రావణాసుడి పాత్రని సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. 30వేల సంవత్సరాల పూర్వం జరిగిన కథతో రామాయణానికి ఉన్న సంబంధాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారట.
ఇవికూడా చదవండి..