డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారులంతా ప్రధాన కార్యాలయాలకు హాజరుకావాలని ఆదేశించింది. అవసరం మేరకు స్థానిక కార్యాలయాలకు వెళ్లేందుకు ఎల్లప్పుడు ఫోన్లో అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఉత్తరాఖండ్లో గత 24 గంటల్లో కొత్తగా 5,084 కరోనా కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,433కు, మరణాల సంఖ్య 2,102కు పెరిగింది. ప్రస్తుతం 33,330 యాక్టివ్ కరోనా కేసులున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.