భాగ్పత్ : ఉత్తరప్రదేశ్లోని భాగ్పత్ జిల్లా లుంబా గ్రామంలో రోజుల వ్యవధిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నేపథ్యంలో ఈ పరిణామంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే గ్రామంలో సర్వే నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఆరోగ్యశాఖ అధికారుల బృందం రంగంలో దిగి సర్వే నిర్వహించింది. మరణించిన వారంతా కొవిడ్ బాధితులు కాదని ఛప్రౌలి సీహెచ్సీ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
‘‘మృతిచెందిన వారంతా 70 ఏండ్లు పైబడిన వారే. కొంత మందికి హృద్రోగ సమస్యలున్నాయి. కొంతమంది షుగర్ వ్యాధి బాధితులున్నాయి. ఈ కొంతమంది ఇతర వ్యాధులతో చికిత్స పొందుతున్న వారు ఉన్నారు. గ్రామంలో జ్వర సర్వే నిర్వహించాం. ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాం. గ్రామ పెద్దలకు కలిసి వివరాలు సేకరించాం’’ అని సూపరింటెండెంట్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.