హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నదని, మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితులు రావని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. వైరస్ స్వభావం, అది కలిగించే నష్టం, చికిత్స విధానం తెలియకపోవటం వల్ల గతంలో కర్ఫ్యూ, లాక్డౌన్ విధించారని చెప్పారు. కరోనా నియంత్రణకు నేటి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికం గా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
అత్యంత అప్రమత్తంగా ఉన్నాం
కరోనాపట్ల నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త లు పాటించాలని శ్రీనివాసరావు సూచించా రు. సరిహద్దు రాష్ట్రాల్లో కేసులు పెరగటం మొదలైన నాటినుంచి రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైందని, ఎలాం టి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్.. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ను పటిష్టం చేశామన్నారు. వారంరోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలను రోజుకు 60 వేలకు పైగా చేస్తున్నామని వెల్లడించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచడంతోపాటు, ప్రజ ల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు. కేంద్రం సూచన ప్రకారం 45 ఏండ్లు దాటినవారికి వచ్చే నెల 1 నుంచి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఇప్పటికే మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని వెల్లడించారు. ప్రస్తు తం 700 ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నదని, మరింత వేగం పెంచేందుకు 2,000 పైగా సెంటర్లను ఏర్పా టు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలోనూ త్వరలో టీకాలు వేస్తారని చెప్పారు. ప్రజలు లాక్డౌన్ భయం పెట్టుకోవద్దని సూచించారు.