న్యూఢిల్లీ: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుఖబీర్ సింగ్ బాదల్తో పాటు ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ను, శిరోమణి అకాలీదళ్కు చెందిన మరో 15 మంది కీలక నాయకులను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో శిరోమణి అకాలీదళ్ ఇవాళ ర్యాలీ మొదలుపెట్టింది. ఢిల్లీలోని గురుద్వారా రక్బ్ గంజ్ నుంచి పార్లమెంటు వైపు ర్యాలీ బయలుదేరిన కాసేపటికే పోలీసులు అడ్డుకుని కీలక నేతలను అరెస్ట్ చేశారు.