హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారినే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. నడకదారి భక్తులకు ముందురోజు ఉదయం 9 గంటల నుంచి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. వాహనాల్లో వచ్చేవారిని ముందు రోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి అనుమతిస్తామని చెప్పారు.