దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో ప్రారంభం
న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ స్మాగ్ టవర్ను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో నిర్మించారు. ఇది కలుషితమైన గాలిని పీల్చుకొని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన గాలిని బయటకు వదులుతుంది. సెకనుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. గాలి కాలుష్యాన్ని సగానికి తగ్గించడమే ఈ టవర్ నిర్మాణ ఉద్దేశం. దీనిని ప్రయోగాత్మకంగా నిర్మించారు. టవర్ పనితీరును అంచనా వేశాక భవిష్యత్తులో మరిన్ని స్మాగ్ టవర్లు నిర్మిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఐఐటీ-బాంబే, ఐఐటీ ఢిల్లీ అందించిన సాంకేతిక సాయంతో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్(టీపీఎల్) ఈ టవర్ను నిర్మించింది. స్మాగ్ టవర్ నిర్మాణానికి ఢిల్లీ మంత్రివర్గం గతేడాది అక్టోబర్లోనే ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, కేంద్రప్రభుత్వం ఆనంద్ విహార్లో నిర్మించిన 25 మీటర్ల మరో స్మాగ్ టవర్ ఇదే నెల 31న ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది.