న్యూఢిల్లీ : ఎయిరిండియా (Air India sale) అమ్మకం చివరి దశకు చేరుకున్నది. బుధవారం ఫైనల్ బిడ్స్ అందాయి. రెండు సంస్థలు మాత్రమే ఫైనల్ బిడ్స్ సమర్పించాయి. వీటిలో ఒకటి టాటా సన్స్ సంస్థ కాగా, మరొకటి స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్సింగ్ ఉన్నారు. తమ బిడ్లను పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు టాటా సన్స్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు స్పైస్జెట్ ప్రమోటర్గా ఉన్న అజయ్సింగ్ వ్యక్తగతంగా దాఖలు చేసిన బిడ్ కూడా పచ్చజెండా ఊపారు. దాంతో ఫైనల్ బిడ్స్ రెండు వచ్చినట్లయింది. బిడ్లు సమర్పించేందుకు ఇవాళే చివరి రోజు. ఎయిరిండియాకు 4,400 దేశీయ, 1800 అంతర్జాతీయ ల్యాండింగ్, దేశీయ విమానాశ్రయాల్లో పార్కింగ్ స్లాట్లపై నియంత్రణ కలిగి ఉన్నది. విదేశాల్లో 900 స్లాట్లను సొంతం చేసుకున్నది.
‘ఎయిరిండియా పెట్టుబడుల కోసం ఫైనాన్షియల్ బిడ్ల ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నది’ అని డీఐపీఏఎం కార్యదర్శి అన్నారు. ఎయిరిండియాలో డివెస్ట్మెంట్ ప్రక్రియ కొవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రమైన జాప్యాన్ని ఎదుర్కొన్నది. ఎయిరిండియా 2018 లో 76 శాతం వాటాను విక్రయించడానికి ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు బిడ్డర్ను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమైంది. అయితే, ఈసారి ఎయిరిండియాలో తన మొత్తం వాటాను విక్రయించాలని ప్రభుత్వం చూస్తున్నది. ఈ ఆఫర్లో మొత్తం ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఏఐఎస్ఏటీఎస్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సామర్థ్యంలో 50 శాతం వాటా ఉన్నాయి.
డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడికి అవకాశం.. ఇంటెలిజెన్స్ నివేదిక
మళ్లీ హైదరాబాద్కు ఆడనున్న విహారి
రుణం లేకుండా ఏపీ మనుగడ సాగించదు: జీవీఎల్
సర్జికల్ మాస్క్లతోనే కరోనా కట్టడి సాధ్యం!
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హత్యకు కుట్ర.. 53వేల డాలర్లకు సుపారీ
జస్టిన్ ట్రూడో విజయం చాలా కష్టమే..!
అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!
ఈనెల 26 న శ్రీనగర్ దాల్ సరస్సుపై తొలి ఎయిర్షో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..