హైదరాబాద్ : రేబిస్ వ్యాధి ముదిరిందన్న భయంతో ఉరేసుకొని రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో సోమవారం ఈ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రానికి చెందిన చిన్న శ్రీను (45) రేబిస్ లక్షణాలతో బాధపడుతూ రెండురోజుల క్రితం చికిత్స నిమిత్తం ఫివర్ ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు వ్యాధితో ముదిరిందని చెప్పారు. దీంతో తీవ్ర భయాందోళనకులోనైన అతడు దవాఖానలోని ఓ గదిలో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.