తిరువనంతపురం : సౌదీ అరేబియా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శనివారం తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విండ్షీల్డ్లో పగుళ్లు కనిపించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. విమానం ఉదయం 7.52 గంటలకు టేకాఫ్ కాగా.. గంట ప్రయాణం తర్వాత పైలట్లు విమానం విండ్షీల్డ్లో పగుళ్లు గుర్తించి.. ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. 8.50 గంటలకు తిరిగి విమానాశ్రయానికి రావాలని అధికారులు సూచించారు.
అయితే, సమయంలో ఈ సమయంలో ప్రయాణికులెవరూ లేరు. కేవలం ఎనిమిది మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. పైలట్లతో సహా సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సీవీ రవీంద్రన్ తెలిపారు. విమానం సౌదీ అరేబియాలోని డామన్ నుంచి ‘వందేభారత్ మిషన్’లో భాగంగా భారతీయ ప్రయాణికులను తీసుకువచ్చేందుకు వెళ్లిందని అధికారులు పేర్కొన్నారు.