న్యూఢిల్లీ: ఇవాళ ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో ఎయిమ్స్ లైట్హౌజ్ లాంటిదని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎయిమ్స్ పట్ల నమ్మకం ఉందన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలు ఎయిమ్స్ వైద్యశాలల కోసం పోటీపడుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 22 ఎయిమ్స్ వైద్యశాలలను ఓపెన్ చేయనున్నట్లు మంత్రి మాండవీయ వెల్లడించారు. ఆరోగ్యరంగాన్ని, అభివృద్ధిని తమ ప్రభుత్వం ఏకం చేసిందని, హెల్తీ ఇండియా విజన్తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, హెల్త్ బడ్జెట్ను 2.40 లక్షల కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు.
ఒకవేళ కోవిడ్ థార్డ్ వేవ్ వస్తే, దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఎయిమ్స్ డైరక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. గత మూడేళ్లలో సాధించిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చినట్లు గులేరియా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి భారతి ప్రవీణ్ కూడా పాల్గొన్నారు.