న్యూఢిల్లీ : దేశంలో రెండేండ్లు పైబడిన చిన్నారులకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కొవ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. పిల్లలపై కొవ్యాక్సిన్ చేపట్టిన రెండు, మూడద దశ పరీక్షలకు సంబంధించిన డేటా సెప్టెంబర్లో అందుబాటు లోకి వస్తుందని అదే నెలలో వ్యాక్సిన్లకు అనుమతి లభిస్తుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు. ఫైజర్, బయోఎన్టెక్ వ్యాక్సిన్కు భారత్లో గ్రీన్సిగ్నల్ లభిస్తే ఆ వ్యాక్సిన్ కూడా పిల్లలకు అందించే అవకాశం పరిశీలించవచ్చని అన్నారు.
ఇక రెండేండ్ల పైబడిన చిన్నారులపై రెండు, మూడవ దశ పరీక్షలు నిర్వహించేందుకు కొవ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కు మే 12న భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళనకరమైన వేరియంటేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ వేరియంట్ వెలుగు చూసిన మహారాష్ట్ర, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలను కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది.