చెన్నై: డీఎంకే తప్పుడు హామీలతో తమిళనాడు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను డీఎంకే ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను డీఎంకే నెరవేర్చకపోవడంపై ఏఐఏడీఎంకే నిరసన వ్యక్తం చేసింది. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెన్నై, థేనిలో బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.
తప్పుడు హామీలతో డీఎంకే అధికారంలోకి వచ్చిందని పన్నీర్సెల్వం ఈ సందర్భంగా ఆరోపించారు. ఎన్నికల వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా డీఎంకే చేసిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.