కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మమతా బెనర్జీ.. కోల్కతాలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. ఈసీ విధించిన ప్రచార నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆమె ధర్నా చేస్తున్నారు. ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 8 నుంచి 13వ తేదీ రాత్రి 8 గంటల వరకు దీదీపై నిషేధం అమలులో ఉన్నది. కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలని ఓటర్లను ప్రేరేపించినందుకు, మతం పేరుతో ఓట్లు అడిగినందుకు ఆమె 24 గంటల పాటు ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించినట్టు ఈసీ ప్రకటించింది.