మేళ్లచెర్వు, ఏప్రిల్ 1 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ కోటాచలం సూచించారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ వేసేందుకు జిల్లాలోని 22 పీహెచ్సీల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రోజుకు సుమారు 3వేల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. అంతకుముందు ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. కొవిడ్ టెస్టులు, కరోనా వ్యాక్సినేషన్ను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ నిరంజన్, ప్రోగ్రాం ఆఫీసర్లు జయ, వెంకటపాపిరెడ్డి, వైద్యాధికారి ప్రేమ్సింగ్, సీహెచ్ఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
కరోనా టీకా వేయించుకోవాలి : డీడీఎంహెచ్ఓ
45ఏండ్లు పైబడిన వారంతా కరోనా టీకాను వేయించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్ సూచించారు. గురువారం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్సెంటర్ వైద్యాధికారి డాక్టర్ శైలజ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మునగాల : 45ఏండ్లు నిండిన వారంతా కరోనా టీకా వేయించుకోవాలని డాక్టర్ యాదా రమేశ్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 1196మంది మొదటి డోసు, 78మంది రెండో డోసు వేయించుకున్నట్లు తెలిపారు. సెలవు రోజుల్లోనూ టీకా వేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో హెచ్ఈఓ షాబుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.
90మందికి వ్యాక్సిన్..
చిలుకూరు : స్థానిక పీహెచ్సీలో గురువారం ఒక్కరోజే 90మందికి కొవిడ్ టీకా వేసినట్లు వైద్యాధికారి ప్రమోద్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శ్రీను, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
ఎర్రటి ఎండలో గర్భిణి 3 కి.మీ. నడక.. ఎస్ఐ సస్పెండ్