బెంగళూరు: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ రాత్రి 9 గంటల నుంచి రెండు వారాలపాటు సంపూర్ణ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జనం కర్ఫ్యూ సమయం లోపలే స్వస్థలాలకు చేరుకోవాలన్న భయంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లకు పరుగులు పెడుతున్నారు. దాంతో ఆ రాష్ట్రంలోని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
ఈ దృశ్యాలు గత ఏడాది లాక్డౌన్ సందర్బంగా స్వగ్రామాలకు చేరడం కోసం ప్రజలు పడిన నరక యాతనను గుర్తు చేస్తున్నాయి. మరోవైపు కూరగాయల మార్కెట్లు, నిత్యావసర సరుకుల దుకాణాలు కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. రెండు వారాల కంప్లీట్ కర్ఫ్యూలో ప్రజారవాణాకు ఎలాంటి అవకాశం ఉండదని, అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలు కోసం కర్ఫ్యూ వేళల్లో సడలింపు ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
యూకే నుంచి భారత్కు ప్రాణాధార వైద్య సామాగ్రి: కేంద్రం
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..