జోగులాంబ గద్వాల : కరోనా ఏర్పాట్లపై రాష్ట్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దేశంలో ఎన్నో చోట్ల ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక జనం పిట్టల్లా రాలిపోతున్న దృశ్యాల్ని మనం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ, తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వం పకడ్బందీ చర్యలతో మహమ్మారి బారిన పడిన వారు త్వరగా కోలుకొని ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన సుజాత అనే మహిళ కరోనా సోకిందేమోననే అనుమానంతో దవాఖానలో టెస్టులు చేయించుకోవాలనుకుంది. అయితే హైదరాబాద్ దవాఖానాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆక్సిజన్ దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో తన పుట్టినిల్లయిన గద్వాలకు చేరుకుంది. స్థానిక జిల్లా దవాఖానలో చేరింది.
ఆక్సిజన్, పడకలు అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స పొందింది. కరోనా పరీక్షల్లో నెగటివ్ గా తేలింది. దీంతో ఆమెను వైద్యులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తన ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ దవాఖాన ఆవరణలో కృతజ్ఞతా భావంతో సుజాత ఒక మొక్కను నాటింది.
ఆక్సిజన్ నిల్వలు లేక అనేక మంది చనిపోతున్న తరుణంలో ప్రభుత్వ దవాఖానలో తనకు చక్కని వైద్యం అందించినందుకు వైద్యులకు సైతం సదరు మహిళ కృతజ్ఞతలు తెలిపింది. కొవిడ్ వచ్చింది అని తెలియగానే ఆందోళన చెంది జిల్లాల నుంచి హైదరాబాద్ పరుగు పెట్టుకు రావాల్సిన అవసరం లేదంటున్నది.
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలలో కూడా చక్కని వైద్యం అందుతోందని సుజాత తెలిపింది. మొన్న, గాంధీ దవాఖానలో తన ప్రాణం నిపినందుకు ఓ మహిళ దవాఖానకు దండం పెట్టడం వైరల్ గా మారిని విషయం తెలిసిందే. నేడు సూజాత మెరుగైన వైద్యం పొంది మొక్కను నాటడం ప్రభుత్వ పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు
జర్నలిస్ట్ శ్రీధర్ మృతి పట్ల సంతాపం తెలిపిన వినోద్ కుమార్