వెల్లడించిన పోలీసులు, ముగ్గురు నిందితుల అరెస్టు
గూడూరు, ఏప్రిల్ 9 : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో సొంత అక్కే పథకం ప్రకారం ఇద్దరితో కలిసి తమ్ముడిని చంపేసిందని సీఐ రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై సతీశ్తో కలిసి సీఐ హత్య వివరాలు వెల్ల డించారు. ఈనెల 6న భూపతిపేటలో కుందారపు విక్రమ్ హత్య జరిగిన విషయం తెలిసిందే.. తమ విచారణలో మృతుడిని అతని సోదరి రోజా, ప్రియుడు పులిచేరి సంతోష్, స్నేహితురాలు బొడ్డు రేణుకతో కలిసి హత్య చేసిందని తెలిపారు. హత్యకు ముందు గతంలో సంతోష్తో రోజా వివా హేతర సంబంధం ఏర్పర్చుకుని భర్తను వదిలివేసి భూపతిపేటలోనే వేరే గది తీసుకుని ఉంటున్నది. విషయం తెలుసుకున్న మృతుడు విక్రమ్ పద్దతి మానుకోవాలని ఇరువురికి తెలిపాడు. కాగా రోజా స్నేహితురాలు రేణుక అక్రమ సంబంధానికి సహాయంగా ఉంటూ అవసరమైతే తన ఇంటిని కూ డా వాడుకోమని చెప్పేది.
ఇది గమనించిన విక్రమ్ ఈనెల 5న నిందితులు ముగ్గురు రేణుక ఇంటి వద్ద ఉండడంతో వారిని మందలించాడు. అవమా నంగా భావించిన నిందితులు ఎలాగైనా విక్రమ్ను హతమార్చాలని పథకం పన్నారు. ఈనెల 6న సంతోష్ స్థానిక ప్రభుత్వ పాఠశాల నుంచి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా రోజా, రేణుక సహాయంతో సంతోష్ విక్రమ్ను ఇనుప రాడ్తో బలంగా కొట్టాడు. కిందపడిపోయిన అతడి ముఖంపై పెద్ద బండతో మోది అక్కడి నుంచి పారిపోయాడు. అధిక రక్త స్రావం కావడంతో విక్రమ్ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. హత్యలో భాగమై, హత్యకు సహకరించిన రోజా, రేణుకను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. హత్య జరిగిన మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నందుకు పోలీసులకు ఎస్పీ కోటిరెడ్డి, ఏఎస్పీ యోగేశ్గౌతం అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ముగ్గురు మహిళలు అరెస్టు
ఆర్టీసీ బస్సులో రూ. 3 కోట్లు స్వాధీనం