Traders on Maharashtra Bandh | లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా సోమవారం బంద్ పాటించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యాపారులు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తొలుత ప్రభుత్వ నిర్ణయానికి మహారాష్ట్ర ట్రేడర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ శివసేన, ఇతర పార్టీల నేతలు సంప్రదింపులు జరపడంతో వ్యాపారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు దుకాణాలను మూసి ఉంచుతామని ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎఫ్ఆర్టీడబ్ల్యూఏ) చీఫ్ వీరెన్షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనాతో 18 నెలలుగా వ్యాపారాలు సాగక భారీ నష్టాలను చవి చూశామని అంతకుముందు వ్యాపారులు వాదించారు. ఇప్పుడిప్పుడే వ్యాపారం పుంజుకుంటున్నదని, ప్రస్తుత పండుగల సీజన్లో శాంతియుతంగా వ్యాపారం చేసుకోనివ్వాలని కోరారు.