చండీగఢ్: హర్యానాలోని ఒక గ్రామంలో అనూహ్యంగా 28 మంది మరణించారు. దీంతో కరోనా వ్యాప్తి భయంతో ఆ గ్రామాన్ని పూర్తిగా మూసివేశారు. రోహ్తక్ జిల్లాలోని టిటోలి గ్రామంలో ఇటీవల 28 మంది చనిపోయారు. బుధవారం గ్రామంలో 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు టిటోలి గ్రామం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. కరోనా వైరస్ పక్క గ్రామాలకు వ్యాప్తించకుండా సరిహద్దులను మూసివేశారు. గ్రామంలోకి ఎవరు ప్రవేశించకుండా పొలిమేరల్లో పోలీసులను మోహరించారు.
మరోవైపు రోహ్తాక్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ రాకేశ్ సైని, టిటోలి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కరోనా పరిస్థితిపై అధికారులతో ఆరా తీశారు. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.