అంబర్పేట, జూలై 3 : ఆగస్టు 1, 2 తేదీలలో జరిగే అంబర్పేట మహంకాళి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శనివారం ఉదయం అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబర్పేట బోనాల జాతరలో ఊరి వాతావరణం ఎక్కువగా ఉంటుందని, ఆ వాతావరణానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. బోనాలు తీసుకొని ప్రతి బస్తీ నుంచి వచ్చే మహిళలకు అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి బస్తీలో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంతో పాటు బస్తీలలో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయాలని, డ్రైనేజీ సమస్య ఉండకుండా చూడాలని తెలిపారు.
జంటనగరాల్లో జరగని విధంగా అంబర్పేటలో బోనాల ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించుకుందామని, అందుకు కావాల్సిన నిధులను సీఎం కేసీఆర్ను అడిగి మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ డీసీ వేణుగోపాల్, ఏఎంఓహెచ్ హేమలత, డీఈ సుధాకర్, ఎలక్ట్రికల్ డీఈ వెంకటరమణారెడ్డి, ఏఈ ప్రసాద్, వాటర్వర్క్స్ డీజీఎం సతీశ్, మేనేజర్ మాజిద్, ఆర్ అండ్ బీ లక్ష్మీనారాయణ, మనోహర్బాబు, రవీంద్రమోహన్, సీఐ సుధాకర్, అంబర్పేట దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు జె.సత్తిబాబుగౌడ్, ఉపాధ్యక్షుడు పి.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీరాములుముదిరాజ్, కార్యదర్శి చెంగళి సుధాకర్, కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం శ్రీధర్గౌడ్, కోశాధికారి వి.మహేందర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పి.జ్ఞానేశ్వర్గౌడ్, బి.వెంకటరెడ్డి, ప్రతినిధులు మోర పాండు, రంగంపల్లి రాజు, కెంచె చంద్రశేఖర్, కెంచె ధనుంజయ, రాధాకృష్ణ, శ్రీహరి, శంకర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, దేవేందర్రెడ్డి, చంద్రకాంత్గౌడ్, శశిధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.