న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహజీవనం చేసిన ఆఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా ఎముకలను స్టోన్ గ్రైండర్లో పౌడర్గా మార్చి పారవేశాడు. మూడు నెలల తర్వాత అతడు పారవేసిన శ్రద్ధా శరీర భాగాల్లో తల ఒకటి. ఇలాంటి అనేక భయంకర విషయాలు ఢిల్లీ పోలీసులు ఇటీవల సమర్పించిన 6,600 పేజీల చార్జిషీట్లో ఉన్నాయి. అందులోని వివరాల ప్రకారం.. తొలుత ప్లాస్టిక్ కవర్లో మృతదేహాన్ని పెట్టి పారవేయాలని భావించాడు. కానీ, వెంటనే పోలీసులకు దొరికిపోతానని ఆ నిర్ణయం మార్చుకున్నాడు.
చివరికి బాడీని ముక్కలుగా నరకాలని నిర్ణయించుకున్నాడు. శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఫ్రిడ్జ్లో శరీర భాగాలను భద్రపరిచాడు. రాత్రివేళల్లో వాటిని అటవీ ప్రాంతాల్లో పారవేశాడు. అతడి స్నేహితురాళ్లు వచ్చినప్పుడు కూడా శ్రద్ధకు సంబంధించిన కొన్ని శరీర భాగాలు ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. శ్రద్ధను చంపిన తర్వాత ఆమె సెల్తో పలువురికి మెసేజ్లు పంపాడు. ఆమె సోషల్ మీడియా ఖాతాలను కొన్నాళ్లు కొనసాగించాడు. ముంబైలో ఆమె సెల్ఫోన్తోపాటు, లిప్స్టిక్ను పారవేశాడు. ఇలా అనేక అంశాలను చార్జిషీట్లో వివరించారు.