న్యూఢిల్లీ : కరోనా కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న రాష్ట్రాల్లో పేదల కుటుంబాలకు నెలకు రూ 6000 నగదు అందించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లోక్ సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ఆదివారం లేఖ రాశారు. పేదలకు నగదు సాయం అందించడం వారి కష్టాలకు కొంత ఊరటగా ఉండటమే కాకుండా ఆర్థిక వ్యవస్థకూ ఉత్తేజం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
లాక్డౌన్ లు, నియంత్రణలతో పలువురు ఉద్యోగాలు కోల్పోయారని వారి ఆదయాలు సన్నగిల్లాయని ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.