వైద్యాధికారుల సూచన
పీహెచ్సీల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
దస్తురాబాద్, మార్చి 30 : కొవిడ్ వ్యాక్సిన్పై ప్రజలు అపోహలు వీడాలని పీహెచ్సీ ఇన్చార్జి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏళ్లు ఉన్న వారికి కొవిడ్ టీకాలను వైద్య సిబ్బంది మంగళవారం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ టీకా మొదటి, రెండో డోసులను 165 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు వేసినట్లు తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన 9 మందికి మంగళవారం టీకాలు వేశామని వెల్లడించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు కూడా కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ప్రయోజనాలపై ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వేణు గోపాల్, సూపర్వైజర్ గంగుబాయి, హెల్త్ అసిస్టెంట్ మధు, స్టాఫ్ నర్సులు లక్ష్మీ ప్రసన్న, ఏఎన్ఎం అరుణ, ఆశ కార్యకర్త సుజాత తదితరులున్నారు.
తానూర్, మార్చి 30 : 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు సుభాష్ తెలిపారు. దవాఖానలో మంగళవారం 45 ఏళ్లు నిండిన వారికి కరోనా టీకాలను వేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని , భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సదానంద్గౌడ్, తదితరులున్నారు.
లోకేశ్వరం, మార్చి 30 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యురాలు హారిక తెలిపారు. మంగళవారం 21 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. మిగతా వారు కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది ఉన్నారు.