లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో షాహీ ఇమామ్-ఇ- జుమా మౌలానా కల్బే జవాద్ నక్వీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు లక్నో మసీదులో శుక్రవారం ప్రార్థనలను నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ మౌలానా కల్బే నక్వీ పేరిట ఓ కరపత్రిక విడుదలైంది.
‘అసీఫీ మసీదులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు శుక్రవారం ప్రార్థనలను నిలిపివేస్తూ ఇమామ్-ఇ-జుమా మౌలానా కల్బే జవాద్ నక్వీ నిర్ణయం తీసుకున్నారు’ అని సదరు కరపత్రికలో పేర్కొన్నారు. కాగా రాష్ట్ర రాజధాని లక్నో సహా పలు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ వేళలను పొడిగిస్తున్నట్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తాజా వేళల ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు