హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కొవిడ్ టీకా వేసుకున్నాక జ్వరం, గొంతు, ఒళ్లు నొప్పుల వంటి తేలికపాటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు ఎదుర్కొంటున్నవారు తక్కువగానే ఉన్నప్పటికీ ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సరైన ఆహారం తీసుకోడం ద్వారా టీకా అనంతర ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిపుణులు చెప్తున్నారు. త్వరగా కోలుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచే, నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. సైడ్ఎఫెక్ట్స్ను అరికట్టేందుకు నీరు ఎక్కువగా ఉండే సూప్స్ తీసుకోవడం మేలని చెప్పారు. చికెన్, మినెస్ట్రోన్ లేదా బోన్ సూప్స్, బీన్స్, కాయధాన్యాలు, ఆలుగడ్డలు, బ్రకోలీ వంటి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఉండేలా చూసుకోవాలి. మాంసాహారులైతే చికెన్ సూప్ ఉత్తమం. క్యారెట్లు, ఉప్పు, మిరియాలు మొదలైనవి వ్యాక్సిన్ వేసుకున్నాక కలిగే మంటతో పోరాడటానికి సహాయపడుతాయి. ఎముకలు ఉడకబెట్టి చేసే పులుసులో ైగ్లెసిన్, అర్జినిన్ అనే అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి బలమైన రోగనిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయి.