హైదరాబాద్ : జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహాకవి డా. సి.నారాయణరెడ్డి నాలుగేండ్ల క్రితం (2017 ) నిర్యాణం చెందారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్ , హైదరాబాద్, డా. సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం, కేతవరపు ఫౌండేషన్, సంతోషం ఫిల్మ్ న్యూస్ సంయుక్తంగా జూన్ 12 సాయంత్రం 5 గంటలకు అంతర్జాలంలో ట్రైనెట్ లైవ్ టీవీ, సంతోషం లైవ్ ద్వారా ‘సినారె’ కు అక్షర సుమాంజలి సమర్పించనున్నారు. సినారె కృతులపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధన చేసిన విద్వాంసుల ప్రసంగాలు ఉంటాయి.
ఈ అపూర్వ నివాళి కార్యక్రమంలో పరిశోధనలు చేసిన డాక్టర్ ఎం కె రాము, డా.వి.ఎల్ నరసింహారావు, డా.నల్లా ప్రభావతి దేవి, డా.నందినేని రవీందర్ ప్రసంగించబోతున్నారు .ఈ కార్యక్రమంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి , భువనచంద్ర , డా. జుర్రు చెన్నయ్య , కళాబ్రహ్మ డా. వంశీ రామరాజు, సురేష్ కొండేటి, డా. కేతవరపు రాజ్యశ్రీ పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి..
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత