జైసల్మేర్: రాజస్థాన్లో దారుణం జరిగింది. సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఓ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జైసల్మేర్ జిల్లాలోని షాగఢ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు (బీఎస్ఎఫ్) చెందిన జవాన్ ప్రేమ్సింగ్ యాదవ్ ఇటీవల ఒక నెల సెలవుపై ఇంటికి వెళ్లాడు. ఏప్రిల్ 30తో సెలవులు ముగియడంతో తిరిగి విధుల్లో చేరాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న ప్రేమ్సింగ్ యాదవ్ బుధవారం రాత్రి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు. ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.