ముంబై: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలాను బెదిరిస్తున్న పెద్ద నేతలు ఎవరన్నది ఆయన బయటపెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఆయనకు ఎవరూ కూడా ఎలాంటి ముప్పు కలిగించలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన వెంట ఉంటుందని, అయితే బెదిరిస్తున్న పవర్ఫుల్ నేతలు ఎవరన్నది అదర్ పూనావాలా వెల్లడించాలని కోరారు.
మహారాష్ట్ర హోంమంత్రి శంభురా దేశాయ్ కూడా ఇదే విషయం చెప్పారు. అదర్ పూనావాలాను ఎవరైనా బెదిరిస్తే ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అదర్ ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.
కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో అదర్ పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో వై క్యాటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఇటీవల లండన్ వెళ్లిన అదర్, ది టైమ్స్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యాక్సిన్ సరఫరా కోసం భారత్లో పవర్ఫుల్ వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. తనపై ఒత్తిడి పెరిగిపోతున్నదని, ప్రతిదీ తాను ఒక్కడినే చేయలేనంటూ వాపోయారు.