న్యూఢిల్లీ: పుణెలోని సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా ( Adar Poonawalla ) ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిశారు. సీరం సంస్థ కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కోవీషీల్డ్ టీకాల సరఫరా గురించి సంస్థ సీఈవోతో మంత్రి మాట్లాడారు. కోవిడ్19 నిర్మూలనలో సీరం సంస్థ చేస్తున్న కృష్టిని మంత్రి అభినందించారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు నిరంతరంగా ఆ కంపెనీకి సపోర్ట్ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇవాళ ఉదయం బయోలాజికల్ ఈ సంస్థ ఎండీ మహిమ ధాట్ల మంత్రిని కలిసిన విషయం తెలిసిందే. కోర్బోవ్యాక్స్ టీకాల గురించి ఆ ఇద్దరూ చర్చించారు.